సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ. 10 కోట్లు
ABN , Publish Date - Jun 20 , 2026 | 06:05 AM
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీఎస్-ఎంఎస్ఈ) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ..
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీఎస్-ఎంఎస్ఈ) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ కేటాయింపుల నుంచి ఈ నిధులు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.