ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:31 AM
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, ముందు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది.
అనకాపల్లి జిల్లా, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈరోజు (మంగళవారం) రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక కారు, ముందు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వైపు కారులో నలుగురు ప్రయాణికులు బయలుదేరారు. కారు నక్కపల్లిలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపానికి చేరుకోగానే, ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు.
కారులో ఉన్న ఓ మహిళకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కాపాడారు. 108 అంబులెన్స్ సహాయంతో బాధితులందరినీ చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే నక్కపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ABN ఎఫెక్ట్.. ఇంద్రకీలాద్రి నకిలీ టికెట్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
నెల్లూరు ఏఎస్పేట దర్గా వివాదం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. వక్ఫ్కు లేఖ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News