కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 09:40 AM
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వైబీఎం ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
కృష్ణా జిల్లా, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వైబీఎం ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. 25 మంది ప్రయాణికులతో ఈ బస్సు చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తుంది.
ఈ ప్రమాదంలో18 మందికి స్వల్ప గాయాలు కాగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను పిన్నమనేని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్
అభివృద్ధి కార్యక్రమాలు జగన్కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News