కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 09:40 AM
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వైబీఎం ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
కృష్ణా జిల్లా, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వైబీఎం ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడతో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 25 మంది ప్రయాణికులతో ఈ బస్సు చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తోంది.
ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను పిన్నమనేని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్
అభివృద్ధి కార్యక్రమాలు జగన్కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News