Share News

జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:57 PM

అక్షరాలా కోటిన్నర రూపాయల సుపారీ ఇచ్చి జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కుట్రపన్నారు. విషయం బయటకు రావడంతో పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు.

జనసేన నేత హత్యకు వైసీపీ కుట్ర.. పోలీసుల అదుపులో నరేంద్ర రెడ్డి
YSRCP Leader Narendra Reddy Arrested

గుంటూరు, సెప్టెంబరు 1: జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు కుట్రపన్నిన కేసును పోలీసులు ఛేదించారు. ఆయన్ను హత్య చేయించడానికి వైసీపీ నేత కంకర నరేంద్ర రెడ్డి రౌడీలకు సుపారీ ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో నల్లపాడు పోలీసులు ఈ రోజు(మంగళవారం) నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని, జిల్లా కోర్టులో హాజరుపరిచారు.


శ్రీనివాస యాదవ్‌ను హతమార్చేందుకు వైసీపీ నేత ఓ గ్యాంగ్‌కు రూ.1.5 కోట్లు సుపారీ ఇచ్చినట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారంతో సదరు జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో సుపారీ తీసుకున్న రౌడీషీటర్ ఇప్పటికే లొంగిపోయాడు. సమగ్ర విచారణ జరిపిన నల్లపాడు పోలీసులు నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో నరేంద్ర రెడ్డి ఎన్నో అరాచకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అరాచకాలను జనసేన నేత బోనబోయిన అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన హత్యకు వైసీపీ నేత కుట్రచేసినట్టు ప్రచారం సాగుతోంది.


ఇవీ చదవండి:

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో అదరగొట్టిన ఎస్‌-400కు మరో ఆర్డర్‌!

పీఎన్బీలో కరెన్సీ చెస్ట్‌లో నకలీ నోట్ల కలకలం.. ముగ్గురి అరెస్ట్

Updated Date - Sep 01 , 2026 | 05:04 PM