యూట్యూబర్ రమా నందనకు మరోసారి ఏపీ పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:38 PM
యూట్యూబర్ రమా నందనకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై బాధితులు ఫిర్యాదు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ రమా నందనకు (YouTuber Rama Nandana) ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.10.50 లక్షలు మోసం చేశారని రమా నందనపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జులై 4వ తేదీన అద్దంకి పోలీస్ స్టేషన్లో రమా నందనపై కేసు నమోదు చేశారు.
ఉద్యోగం ఏర్పాటు చేయకపోవడంతో పాటు, తీసుకున్న నగదును తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీన అద్దంకి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని రమా నందనను పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. రమా నందనపై పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్.. మద్యం షాపులపై కీలక నిర్ణయాలు
గణేశ్ మండపాలకు 9 రోజుల ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News