ఏపీలో మున్సిపల్ ఎన్నికల దిశగా ఎస్ఈసీ కసరత్తు
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:54 PM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా మరో 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
అమరావతి, సెప్టెంబర్15: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా మరో 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ మే రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఫారం 1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22న ప్రకటించాలని పేర్కొన్నారు. 2026 జనవరి 1వ తేదీన అర్హత తేదీగా పరిగణించి.. తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపొందించాలని సూచించారు.
విజయనగరం కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుగా పూర్తి అయింది. దీంతో సెప్టెంబర్ 3 నాటికే ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. అలాగే రాష్ట్రంలో 106 పురపాలక, నగర పంచాయతీల్లో డిలిమిటేషన పూర్తయిన 58 చోట్ల కూడా సెప్టెంబర్ 3నే జాబితాలను వెల్లడించారు. మిగిలిన 12 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబర్ 14 నుంచి 17 మధ్య పూర్తి కానుంది.
అందుకు సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్ఈసీ.. సెప్టెంబర్ 22ను ప్రచురణ తేదీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాల ప్రచురణతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి:
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం