Share News

ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల నియామకం

ABN , Publish Date - Aug 05 , 2026 | 04:34 PM

ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత జాబితాలో నియమించింది. రెండో విడతలో 292 మందిని కోఆర్డినేటర్లుగా నియమించింది.

ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల నియామకం
APNRT

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఎన్ఆర్టీ (APNRT) కోఆర్డినేటర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రెండో విడత జాబితాలో నియమించింది. రెండో విడతలో 292 మందిని కోఆర్డినేటర్లుగా నియమించింది. ప్రవాసాంధ్రుల అభ్యున్నతికి సంక్షేమం కోసం ఈ నియామకాలు చేపట్టినట్లు ఏపీ ఎన్ఆర్టీ ప్రకటించింది. భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛంద సేవలు అందించేందుకు కోఆర్డినేటర్లు సహకరిస్తారని తెలిపింది. కొత్తగా కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ప్రెసిడెంట్ వేమూరి రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు.


null

వార్తలు కూడా చదవండి...

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 05:00 PM