Share News

అజిత్ తల్లి మోహిని మణి మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

ABN , Publish Date - May 31 , 2026 | 04:27 PM

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

అజిత్ తల్లి మోహిని మణి మృతి..  పవన్ కల్యాణ్ సంతాపం
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ మాతృమూర్తి మోహిని మణి మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. మోహిని మణి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్. మోహిని మణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి అజిత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


అలాగే ఈ క్లిష్ట సమయంలో అజిత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని డిప్యూటీ సీఎం తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఈ విషాదాన్ని ఎదుర్కొనే శక్తిని పొందాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అజిత్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా మోహిని మణికి నివాళులు అర్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 04:35 PM