మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:40 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల(AP Assembly Budget Session) నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం గం.9:00 నుంచి మధ్యాహ్నం గం.1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 14న బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. 15, 16న సెలవులు కాబట్టి 17, 18వ తేదీల్లో బడ్జెట్పై చర్చ, 18న రాష్ట్ర పద్దుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఉంటుంది.
19వ తేదీ నుంచి 8 పనిదినాలు, డిమాండ్ల గ్రాంట్లపై అసెంబ్లీ బీఏసీ చర్చించనుంది ఈ నెల 28న శనివారం నాడు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి. మార్చి 1, 2, 3వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలుగా నిర్ణయించింది. మార్చి 6, 7న బడ్జెట్పై మరోసారి చర్చించనున్నారు. ఆ తర్వాత అవసరం మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా? వద్దా? అనే విషయమై అసెంబ్లీ బీఏసీ నిర్ణయించనుంది. అసెంబ్లీ సమావేశాల్లో రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..
మంత్రి కందుల దుర్గేశ్కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!
Read Latest Telangana News And AP News And Telugu News