Home » AP Assembly Speaker
కొందరు ఎమ్మెల్యేల దొంగ సంతకాల నివారణకే ఫొటో రికగ్నజేషన్ పెట్టామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆరు నెలలుగా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 17వ తేదీన ఉదయం 10 గంటలకు శాసన మండలి మొదలు కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, నియోజకవర్గాల కోసం పని చేయకపోతే మీరెందుకంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.
టీటీడీ సహకారంతో తిరుపతిలోని జూపార్క్ను అభివృద్ధి చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. జూపార్క్ అభివృద్ధికి టీటీడీ సహకారం కోరుతామని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.
బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.
ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.