Home » AP Assembly Speaker
బహ్రెయిన్లోని అమెరికన్ నావల్ బేస్పై ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది వరకు అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు వీక్షించడానికి విద్యార్థులు ఇవాళ(బుధవారం) వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు.
ఏపీ అసెంబ్లీని ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు వీక్షించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విద్యార్థులకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించడం వెనుక ఉద్దేశం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు.
ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి .
సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.