ఊరించి.. ఉసూరుమనిపించి..
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:39 AM
చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి.
చిత్తూరు: పలమనేరు మార్కెట్లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి. పది రోజుల కిందట 15 కిలోల బాక్సు ధర రూ.550 వరకు పలికింది. ఐదు రోజులు సుమారుగా అదే ధర కొనసాగింది. ఆదివారం బాక్సు ధర రూ.500 పలకగా, సోమవారం రూ.450, మంగళవారం రూ.400, బుధవారం రూ.350కి పడిపోయింది. కాగా.. ధరలు పెరుగుతుండటంతో ఈసారి అప్పులు తీరిపోతాయని భావించిన టమోటా రైతులు, నిరాశ చెందారు. కనీసం ఇదే ధర కొనసాగినా నష్టం రాదని అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే!
Read Latest Telangana News and National News