తిరుమల ప్రసాదాల నాణ్యతలో మార్పు వచ్చింది
ABN , Publish Date - Apr 08 , 2026 | 07:23 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని మంగళవారం అర్చన సేవలో ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరిని వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల, తిరుపతిలో చేపట్టిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధవాతావరణం తొలగిపోయి శాంతి నెలకొల్పాలని స్వామిని ప్రార్థించానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News