Home » Sujana Chowdary
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటూ అమరావతిని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో చాలా మార్పు వచ్చిందని, ప్రసాదాలు ప్రస్తుతం చాలా రుచికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తొలిసారిగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆ తర్వాత నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తునే ఉన్నానని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.
సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని స్మరించుకున్నారు. ఆయనకు తానంటే ప్రత్యేక అభిమానం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టిన పనులను అభినందించి, ప్రోత్సహించేవారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సీఎం చంద్రబాబు హైదరాబాద్లో పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
Kirti Vardhan Singh: 2047 వికసిత్ భారత్లో భాగంగా ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మన దేశం అగ్ర స్థానంలో ఉంటుందని ఉద్ఘాటించారు.
Sujana Chowdary: పదేళ్ల నుంచి దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని సుజనా చౌదరి చెప్పారు.
Narayana Statement: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు వేలకోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు.
AP BJP MLAs: ఏపీ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం విజయవాడలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగింది. ఆ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఆ పార్టీ సీనియర్లు సైతం హాజరయ్యారు.