కిరణ్ రాయల్ కేసులో మరో ట్విస్ట్.. జనసేన, వైసీపీ నేతలపై ఫిర్యాదు

ABN, Publish Date - Oct 04 , 2025 | 06:41 PM

జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్‌పై కిరణ్ రాయల్ కేసు బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో వారిపై పిర్యాదు చేసింది.

తిరుపతి: జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో మరో కోణం వెలుగు చూసింది. స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో జనసేన, వైసీపీ నేతలపై కిరణ్ కేసు బాధితురాలు లక్ష్మీ రెడ్డి పిర్యాదు చేసింది. జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్ పై పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌‌లో వారిపై పిర్యాదు చేసింది. తన ఫోటో, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసారని వైసీపీ నేత సురేష్ పై ఆరోపణలు చేశారు. సురేష్ కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ సహకరించారని కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలని లక్ష్మీ రెడ్డి కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

Updated at - Oct 04 , 2025 | 06:42 PM