CM Chandrababu: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ.. 24 గంటల్లో అమలు
ABN, Publish Date - Jan 02 , 2025 | 07:14 PM
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓ హామీని అధికారులు 24 గంటల్లోనే అమలు చేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామస్తుడు ఏడుకొండలుకు 24 గంటల్లోనే అధికారులు గాలియంత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏడు కొండలు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు.
పల్నాడు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓ హామీని అధికారులు 24 గంటల్లోనే అమలు చేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామస్తుడు ఏడుకొండలుకు 24 గంటల్లోనే అధికారులు గాలియంత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏడు కొండలు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. వారి కుటుంబ పరిస్థితులను అడిగి సీఎం తెలుసుకున్నారు. గాలి యంత్రం నడుపుతూ వచ్చిన డబ్బులకు తోడూ పింఛన్తో కుటుంబాన్ని నెట్టుకువస్తున్నానని సీఎం చంద్రబాబుకు ఏడుకొండలు తెలిపారు. గాలి యంత్రం పాతది అయిందని కొత్తది కావాలని ఆయన కోరాడు. ఆరోగ్య పరిస్థితి బాగోలేక పనులకు వెళ్లలేకపోతున్నానని ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటుకు సాయం చేయాలని ఏడుకొండలు కుమారుడు సురేష్ కోరాడు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్ కింద రూ. 5 లక్షల చెక్కును ఆరోజే అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు కలెక్టర్ అరుణ్ బాబు, ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ రావు బుధవారం ఏడు కొండలు ఇంటికి వెళ్లి గాలి యంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబం సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రాకతో తమ ఇంటికి వెలుగు వచ్చిందని అన్నారు. తమకు ఇచ్చిన మాటను అమలు చేసి సీఎం చంద్రబాబు తమ కుటుంబాన్ని ఆదుకున్నారని ఏడుకొండలు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నటి హేమకు బెంగుళూరు హైకోర్టులో ఊరట...
కొడిగుడ్డు కొనేటట్టు లేదు..తినేటట్టు లేదు..
ఏబీఎన్ చేతికి ఆదినారాయణపై దాడి దృశ్యాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 02 , 2025 | 07:39 PM