Home » AP Pensions
Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్తో పెన్షన్దారులు నీరసించిపోతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఎండల్లో బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. అయితే అనేక మంది అకౌంట్లు ఇన్ ఆపరేట్లో ఉండటంతో పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పెన్షన్ కోసం పెద్ద సంఖ్యలో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలతో అగచాట్లు పడుతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్కు సూచిస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల (AP Pensions) పంపిణీపై ఎంత హైడ్రామా జరుగుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ ప్రభుత్వం (Jagan Govt) పన్నిన పన్నాగంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి. మండుటెండలో వెళ్లి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఆఖరికి..
Andhrapradesh: పెన్సనర్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. జగన్ వీరాభిమానులు స్పందిస్తున్నారు. వారి రియాక్షన్ చూస్తే...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.