Share News

KTR: రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

ABN , Publish Date - May 13 , 2025 | 10:11 AM

రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టి మహాపాపం మూటగట్టుకుందని కేటీఆర్ అన్నారు.

KTR: రాసిపెట్టుకోండి.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..

హైదరాబాద్: తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వమే అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) అన్నారు. ముషీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‏రావు కేటీఆర్‌ను కలిసి ముషీరాబాద్‌ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజాసమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Toll plaza: ఒకే లేన్‌.. మిగతావన్నీ క్లోజ్‌


city5.jpg

రాబోయే జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసి, బీఆర్‌ఎస్‏కు మద్దతు ఇచ్చేలా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రజని కాంత్‌ గౌడ్‌, ముప్పిడి నర్సింగ్‌రావు, నాగేష్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 10:11 AM