Hyderabad: ఈదండి.. ఆడండి..
ABN , Publish Date - May 10 , 2025 | 10:43 AM
నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు అవకాశం కల్పించారు.

- కేపీహెచ్బీలో అందుబాటులోకి ఇండోర్ స్టేడియం
- తక్కువ ఫీజుతో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్
- ప్రస్తుతం పురుషులకే
- త్వరలో పిల్లలు, మహిళలకు స్విమ్మింగ్ అవకాశం
హైదరాబాద్: కేపీహెచ్బీ(KPHB)లో క్రీడాభిమానులకు ఇదొక శుభవార్త. అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చిన ఇండోర్ స్టేడియం ఇప్పుడు స్విమ్మింగ్, షటిల్ బ్మాడ్మింటన్ వంటి ఆటలకు కేంద్రంగా మారింది. ప్రస్తుతం స్విమ్మింగ్ అవకాశం పురుషులకు మాత్రమే ఉన్నా.. త్వరలోనే మహిళలు, పిల్లలు కూడా అవకాశం కల్పిస్తామని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కి ‘లేడీ’.. పెళ్లి సంబంధం కుదుర్చుకుని..
అందుబాటులోకి స్విమ్మింగ్పూల్, బ్మాడ్మింటన్..
కేపీహెచ్బీ ఆరోఫేజ్లోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్పూల్, షటిల్ బ్మాడ్మింటన్ ఆడే అవకాశం ఉంది. గంటకు 50 మంది స్విమ్మింగ్, ఒక్కో బ్మాడ్మింటన్ కోర్టులో గంటకు ఆరుగురు చొప్పున నాలుగు కోర్టుల్లో కలిపి 24 మంది ఆడవచ్చు. ఐదేళ్లుగా ప్రైవేటుతో నడిచిన కేంద్రాన్ని గత నెలలో జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇందులో ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి. స్విమ్మింగ్కు నెలకు రూ.500, షటిల్ బ్యాడ్మింటన్కు రూ.1000గా నిర్ణయించారు.
రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్విమ్మింగ్, సాయంత్రం 7 నుంచి 9 వరకు పెద్దలు షటిల్ బ్మాడ్మింటన్ ఆడుకోవచ్చు. ప్రతి సోమవారం స్టేడియానికి సెలవు ఉంటుంది. స్టేడియానికి వచ్చే వారికి వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం స్విమ్మింగ్పూల్లో పురుషులకు మాత్రమే అవకాశం కల్పించారు. అతి త్వరలో పిల్లలు, మహిళలకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. చిన్నారులకు ఈత నేర్పడం కోసం ప్రత్యేకంగా కోచ్లను నియమిస్తామని పేర్కొంటున్నారు.
స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుతం ఈ స్టేడియం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోంది. గతంలో అధిక చార్జీలు ఉండేవి. ప్రస్తుతం అందులో నాలుగోవంతు చెల్తిస్తే సరిపోతుంది. స్విమ్మింగ్ చేయాలనుకునే వారు, షటిల్ బ్మాడ్మింటన్ ఆడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. కేపీహెచ్బీ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- వీరానంద్, గేమ్స్ ఇన్స్పెక్టర్, కూకట్పల్లి జోన్
ఈ వార్తలు కూడా చదవండి
Drone Attacks: ఉద్రిక్తంగానే..
Miss World 2025: మిస్వరల్డ్ పోటీలకు 5వేల మందితో భద్రత
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Operation Sindoor: యుద్ధ బీభత్సం
Read Latest Telangana News and National News