Share News

BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేతకు నోటీసులు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:37 PM

Srinivas Reddy: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉండే ఫామ్ హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటి వరకు డ్రగ్స్ పార్టీలు చూశాం. తాజాగా ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఏ విధంగా అయితే కోళ్ల పందాలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారో.. అదే తరహాలో నగర శివారు ప్రాంతం ఫామ్ హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాలు నిర్వహించారు. అయితే ఫామ్ హౌస్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు.

BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేతకు నోటీసులు
BRS

సైబరాబాద్: కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి(MLC Pochampally Srinivas Reddy) మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) ఇవాళ(గురువారం) నోటీసులు ఇచ్చారు. కోడి పందాలు జరిగిన ల్యాండ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మొయినాబాద్ తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aలో ఈ ఫార్మ్ హౌస్ ఉందని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా మొయినాబాద్ పోలీసులు చేర్చారు. సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద్ కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఫార్మ్ హౌస్‌లో బెట్టింగ్స్ చేస్తూ పందాలు ఆడిస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నారు. ఫార్మ్‌హౌస్‌లో భారీ సెటప్‌తో కోడి పందాలను గబ్బర్ నిర్వహించాడు. అయితే కోడిపందాలకు సంబంధించి మరి కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి.


బెట్టింగ్ కాయిన్స్ సీజ్..

కాగా.. మూడు రోజుల క్రితం నగర శివారులో భారీ క్యాసినోను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌పై దాడి చేసిన రాజేంద్రనగర్ పోలీసులు.. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం పరుచుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పు కట్టలేదని ఏం చేశారంటే..

ఉచితం.. అనుచితం

మృతదేహం జాడ దొరకలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 01:35 PM