Share News

Mahesh Kumar Goud: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా, రాహుల్‌పై కేసులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:54 PM

Mahesh Kumar Goud: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా, రాహుల్‌పై కేసులు
Mahesh Kumar Goud

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన చేస్తోందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్‌ను చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలని తాము ధర్నా చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు ఎదుట ఇవాళ(గురువారం) టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కి రూ.90 కోట్లు రుణం ఇస్తే మనీలాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.


తగ్గుతున్న మోదీ హవా..

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మనీలాండరింగ్ కేసు కక్ష్య సాధింపు చర్యలేనని విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్‌‌ను బద్నాం చేసేందుకు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడింది లేదని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరని చెప్పారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అని మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు.


దేశ ప్రజల గొంతుక రాహుల్ గాంధీ..

దేశ ప్రజల గొంతుక రాహుల్ గాంధీ అని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. రాహుల్ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్ అని చెప్పారు. కులగణనతో రాహుల్ గాంధీ మోదీకి రాజకీయ మరణ శాసనం రాశారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ , సోనియా గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలు రాగానే ప్రతి పక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడటం మోదీ - అమిత్ షాలకు బాగా అలవాటుగా మారిందని విమర్శలు చేశారు. గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు అసమానమైనవని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.


రాహుల్ గాంధీది క్షమించే గుణం: జగ్గారెడ్డి

jagga-reddy.jpg

సంగారెడ్డి జిల్లా: రాహుల్ గాంధీది క్షమించే గుణం.. మోదీ, అమిత్ షాలది కుట్ర గుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద ఇవాళ (గురువారం) జగ్గారెడ్డి ధర్నా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధాన మంత్రిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్‌ను ప్రధాన మంత్రిని చేశారని గుర్తుచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మోదీ, అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. స్వాతంత్య్ర సమరాన్ని ఉధృతం చేసేందుకు, ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేలా నేషనల్ హెరాల్డ్ ఎంతో కృషి చేసిందని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ ప్రారంభించినప్పుడు మోదీ, అమిత్ షాలు పుట్టనేలేదని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర అసలు లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

National Herald Case: రాజకీయ ఈడీ కేసు

CM Revanth Reddy: జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

Kanch Gachibowli: కంచగచ్చిబౌలి భూములకు అటవీ లక్షణాలు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 02:07 PM