Share News

KTR VS Jupally Krishna Rao: కేటీఆర్‌‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:14 PM

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

KTR VS Jupally Krishna Rao: కేటీఆర్‌‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్
Jupally Krishna Rao

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష, అధికారపక్షాల నాయకుల మధ్య మాటల యుద్ధాలు బీకర స్థాయికి చేరుకున్నాయి. నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డిపై కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు.


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. లేదంటే మీరు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాను ఏం మాట్లాడానో పూర్తి వీడియో చూస్తే తెలుస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ చర్చకు వస్తే.. పూర్తి వీడియో చూపిస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు రూ.8 లక్షల కోట్లు బాకీ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పులి పంజా విసిరితే బీఆర్ఎస్ గద్దే దిగిందని మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

ఆసియా కప్‌ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్‌

Updated Date - Sep 29 , 2025 | 06:56 PM