KTR: తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం.. కేటీఆర్ విసుర్లు
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:00 AM
KTR: తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం వార్డు మెంబెర్గా కూడా గెలవని వ్యక్తికి సీఎం స్థాయి పవర్స్ అంటే ఎనుముల రాచరిక పాలనలో మాత్రమే జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలో కాదని స్పష్టం చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతి రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఏ అధికారంతో చేస్తున్నారు? అని నిలదీశారు. రెండు కాన్వాయ్లు, గన్మెన్లు, ప్రోటోకాల్తో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధికారం చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్కి కొత్త ఎమ్మెల్యే కావాలని ప్రజలు అనుకుంటే…ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుంది కదా అని విమర్శించారు. ఈ రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి? ఈ కుటుంబం పాలన దేనికి? నిదర్శనమని మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్టుకుని తిరిగే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే విషయాలు తెలుసా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని? కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
Minister Ponnam Prabhakar: క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తాం
KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం
Bhatti Vikramarka: గురుకుల విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం
Read Latest Telangana News and Telugu News