Operation Sindoor: ఆపరేషన్ సింధూర్తో దేశ ఆత్మగౌరవం ఇనుమడించింది: మోహన్ భాగవత్
ABN , Publish Date - May 09 , 2025 | 09:50 PM
కర్ణాటకలో రెండ్రోజల పర్యటనకు వచ్చిన మోహన్ భాగవత్ బెళగవిలో శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు చెప్పారు.

బెళగవి: పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత సమయంలో భారతీయులంతా కలిసి కట్టుగా ఉన్నారని, యావద్దేశం సైన్యం వెంటే ఉందని అన్నారు.
Operation Sindoor: ఆర్మీకి ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు.. ముందుకొచ్చిన ఎంపీ ట్రాన్స్పోర్టర్స్ ఆర్గనైజేషన్
కర్ణాటకలో రెండ్రోజల పర్యటనకు వచ్చిన మోహన్ భాగవత్ బెళగవిలో శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు చెప్పారు. పహల్గాంలో నిరాయుధులైన టూరిస్టులపై పిరికిపంద చర్యకు పాల్పడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దీటుగా భారత్ బదులిచ్చిందని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగడంతో పాటు దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచిందని చెప్పారు.
జాతీయ ఐక్యత, పౌర బాధ్యతకు ప్రతి ఒక్కరూ కట్టుబడాలని, ప్రభుత్వ అడ్వయిజరీలను తూ.చ. తప్పకుండా పాటించాలని, విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈయన సూచించారు. పౌర బాధ్యతలతో పాటు, ప్రజలంతా దేశభక్తిని చాటుకోవాలని, జాతీయ భద్రత, ఐక్యతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి, ఆర్మీకి సహకరించాలని పిలుపునిచ్చారు.
Also Read:
Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్
పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News