Home » Mohan Bhagwat
బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
జన్సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని మోహన్ భగవత్ అన్నారు.
సంఘ్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.
సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
జాతుల మధ్య ఘర్షణలతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, హిందూ సమాజం ధర్మానికి ప్రపంచ సంరక్షుడిగా ఉందన్నారు. భారత్ అంటే అమర నాగరికతకు పేరని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవించదని, కాషాయం జెండాలను మాత్రమే గౌరవిస్తుందని కొందరి అభిప్రాయంగా ఉందని అడిగినప్పుడు, ఆర్ఎస్ఎస్లో కాషాయాన్ని గురువుగా భావిస్తామని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎంతగానో గౌరవిస్తామని మోహన్ భాగవత్ చెప్పారు.
భారతదేశం అనే ఇంటిలోని ఒక గది 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని మోహన్ భగవత్ అన్నారు. ఇంట్లోని గదిని ఎవరో ఆక్రమిస్తే దానిని మనం వెనక్కి తీసుకోవాలని, మనది అవిభక్త భారతదేశమని గుర్తుంచుకోవాలని అన్నారు.
మూడు వేల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని మోహన్ భగవత్ అన్నారు.
సెప్టెంబర్లో తన 75వ పుట్టినరోజు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 'పదవీ విరమణ' చేస్తారనే ఊహాగానాలు నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత నిచ్చారు. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు ఢిల్లీలో తేల్చి చెప్పారు.
ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.