పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
ABN, Publish Date - May 09 , 2025 | 06:24 PM
పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలను ప్రయోగించిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ.. మే 7,8 వ తేదీ రాత్రి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ సైన్యం మొత్తం పశ్చిమ సరిహద్దు అంతటా భారత గగనతలాన్ని అనేక సార్లు ఉల్లంఘించిందని తెలిపారు.
న్యూఢిల్లీ, మే 09: పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలను ప్రయోగించిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ.. మే 7,8 వ తేదీ రాత్రి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ సైన్యం మొత్తం పశ్చిమ సరిహద్దు అంతటా భారత గగనతలాన్ని అనేక సార్లు ఉల్లంఘించిందని తెలిపారు.
36 ప్రదేశాలలో చొరబాటుకు ప్రయత్నించడానికి దాదాపు 300 నుండి 400 డ్రోన్లను ఉపయోగించారని వివరించారు. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ డ్రోన్లలో చాలా వాటిని కూల్చి వేశాయని ఆమె గుర్తు చేశారు. ఇంత పెద్ద ఎత్తున వైమానిక చొరబాట్ల ఉద్దేశ్యం.. వాయు, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచారాన్ని సేకరించడమేనని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్ల శిధిలాలను ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తుందన్నారు. ఈ ద్రోనులు.. టర్కిష్ అసిస్గార్డ్ సోంగర్ డ్రోన్లు అని ప్రాథమిక నివేదికలలో స్పష్టమైందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 09 , 2025 | 06:24 PM