Share News

Operation Sindoor: ఆర్మీకి ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు.. ముందుకొచ్చిన ఎంపీ ట్రాన్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్

ABN , Publish Date - May 09 , 2025 | 09:12 PM

భారత సైన్యానికి మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సుమారు 7.5 లక్షల ట్కక్కులు ఉచితంగా అందిస్తామని, దీనిపై పీఎంఓకు లేఖ రాశామని ఏఐఎంటీసీ మధ్యప్రదేశ్ రాష్ట్ర విభాగం చీఫ్ మకాఠి తెలిపారు.

Operation Sindoor: ఆర్మీకి ఉచితంగా 7.5 లక్షల ట్రక్కులు.. ముందుకొచ్చిన ఎంపీ ట్రాన్స్‌పోర్టర్స్ ఆర్గనైజేషన్

ఇండోర్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్‌‌ (Operation Sindoor)తో పాక్‌పై విరుచుకుపడుతున్న భారత బలగాలకు 7.5 లక్షల ట్రక్కులను ఉచితంగా అందజేసేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌ కార్పొరేషన్ (AIMTC) మందుకు వచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసినట్టు అసోసియేషన్ రాష్ట్ర యూనిట్ చీఫ్ సీఎల్ ముకాటి శుక్రవారంనాడిక్కడ మీడియాకు తెలిపారు.

India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన


భారత సైన్యానికి మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన సుమారు 7.5 లక్షల ట్రక్కులు ఉచితంగా అందిస్తామని, దీనిపై పీఎంఓకు లేఖ రాశామని ముకాఠి చెప్పారు. ''భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో యావద్దేశం గర్విస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దేశసేవగా మధ్యప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన 7.5 లక్షల ట్రక్కులను ఆర్మీకి ఉచితంగా అందజేయాలని నిర్ణయించాం. సరిహద్దుల్లో సైన్యం ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాల వల్లే ఈరోజు దేశప్రజలంతా సురక్షితంగా ఉన్నాం'' అని ఆయన అన్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో సుమారు 1,000 ట్రక్కులను మోహ్‌లోని ఆర్మీ కంటోన్మెంట్‌కు తాము అప్పగించినట్టు తెలిపారు.


Also Read:

Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్

పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం

Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..

Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

For National News And Telugu News

Updated Date - May 09 , 2025 | 09:14 PM