Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్
ABN , Publish Date - May 09 , 2025 | 07:04 PM
Operation Sindoor: జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ తదితర ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు తెగ బడింది. వీటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

న్యూఢిల్లీ, మే 09: భారత్ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని పాకిస్థాన్ విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు పాకిస్థాన్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే భారత్లోని పలు రాష్ట్రాలపై డ్రోనులు, క్షిపణులతో దాడులు చేసింది. వీటిని భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ భారత్పై పాకిస్థాన్ సైబర్ దాడికి దిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఆ క్రమంలో దేశంలోని ఆర్థిక సంస్థలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ, యూపీఐలకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇది వాస్తమేనని ప్రభుత్వ సీనియర్ ఉన్నతాధికారి శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సమగ్రతతోపాటు భద్రత కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. దేశంలో సైబర్ దాడి జరిగే అవకాశముందని.. దీంతో ప్రధాని ఆర్థిక రంగ సంస్థలు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని ఆర్బీఐ ఇప్పటికే ఓ సలహా, సూచన చేసిందని తెలిపారు.
మే 8వ తేదీ రాత్రి.. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ తదితర ప్రాంతాలతోపాటు సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు తెగ బడింది. వీటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఇరుదేశాలు.. ఒకదానికొకటి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాయి. అపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసింది.
ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. ఈ ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా భారత్పై పాకిస్థాన్ క్షిపణలు, ద్రోనులతో దాడి చేసింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో భారత్ను దెబ్బ తీయడమే తన ఏకైక లక్ష్యమనట్లుగా పాకిస్థాన్ ఆ దిశగా అడుగులు వేసి.. సైబర్ దాడికి దిగే అవకాశం ఎంత మాత్రం లేక పోలేదని భావిస్తోంది. అందులోభాగంగా... ఆర్థిక శాఖ.. ఆర్బీఐతోపాటు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది.
Also Read:
పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News