Home » Army
దాయాది పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతూనే ఉంది.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్లోని ద్రాస్లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....
మణిపూర్లో జిరిబం జిల్లాలోని మాంగ్బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.
కేంద్ర సాయుధ దళాల్లోని 10 కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్క్వార్టర్స్లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు.
కశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లా ఫ్రిసాల్ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.