Home » Army
భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఐఈడీ పేలుడు ధాటికి ముగ్గురు జవాన్లు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నవరణె తన అముద్రిత పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పై నెలకొన్న వివాదంపై స్పందించారు. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను కోట్ చేసి తనను వివాదంలోకి లాగారని, అది సరైనది కాదని అన్నారు.
ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
విశాఖపట్నం ఐఎన్ఎ్స సిర్కార్స్ నేవల్ బేస్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని సైనిక సంక్షేమ కార్యాలయంలో అవుట్రీచ్ ప్రోగ్రాం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 50 మందికిపైగా నావికాదళ మాజీ సైనికులు, విడోలు, ఆధారితులు హాజరయ్యారు.
భారత సైన్యంలో అగ్నివీర్ (జనరల్/ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.
దక్షిణ థాయిలాండ్లోని ఓ పాఠశాలలో ముష్కరుడు రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల కొద్దీ ప్రాణాలు తీశాడు.
జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫానుల వల్ల దారిపొడవునా గడ్డకట్టే చలి, భారీగా పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడారు భారత సైన్యం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన భారత సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని పెంచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
జమ్మూకశ్మీర్లో ఆర్మీ వాహనం అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.