Home » RSS
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చట్టబద్ధ హోదా, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్మాణం, పన్ను వర్తింపు వివరాలను బహిర్గతం చేయాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే కోరారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్కు సోమవారంనాడు లేఖ రాశారు.
రాష్ట్రీయ స్యయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అయితే అత్యంత అపార్థానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
హిందువులను సంఘటితం చేసేందుకే స్వయం సేవక్ సంఘ్ను కేశవ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులంతా మరింత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదని.. అలా అని ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్లో అన్ని రంగాలకు సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు..
జన్సంఘ్, దాని నుంచి వచ్చిన బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృసంస్థనే విస్తృతాభిప్రాయం ఉందని, అయితే అవి సంఘ్కు వ్యతిరేకంగా అల్లుకున్న కథనాలేనని మోహన్ భగవత్ అన్నారు.
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.
కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు.
సంఘ్కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.