PVN Madhav: షర్మిల మత ప్రచారం చేశారు.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:50 PM
వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారని ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించేలా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. టీటీడీ నిధులతో సుమారు 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారని గుర్తు చేశారు. దేవాలయాల నిర్మాణాలు ఆర్ఎస్ఎస్ ఎజెండా అని షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలపై పరిజ్ఞానం లేకుండా, అవివేకంగా షర్మిల మాట్లాడారని విమర్శించారు. ఆమెకు దేవాలయాల వ్యవస్థపై ఎటువంటి అవగాహన, ఆలోచన లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు.
వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పుడైనా దేవాలయాలను సందర్శించారా? అని మాధవ్ ప్రశ్నించారు. మత ప్రచారాలు స్వయంగా భర్తతో కలిసి చేశారని ఆరోపించారు. మత మార్పిడి చేయాలని పెద్ద ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గతంలో ఏడుకొండలు మూడు కొండలుగా మార్చాలని జీవో ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ నిధులు ఎలాంటి దుర్వినియోగం అవ్వడం లేదని స్పష్టం చేశారు. నిధులను ఆలయాల నిర్మాణాలు, ధార్మిక సంస్థల నిర్మాణం, ధూపదీప నైవేద్యం కోసం ఉపయోగించుకుంటున్నారని మాధవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్