Share News

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Mar 06 , 2025 | 08:01 AM

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‌కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి.

YSRCP Scams: వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు
YSRCP Scams

నెల్లూరు: నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓ వెలుగు వెలుగొందారు. అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఒక రేంజ్‌లో రెచ్చిపోయారు. ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో వారు అందినకాడికి దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో వారెవరికీ నిద్ర కూడా పట్టడం లేదట. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులకు ఇప్పుడు ఫోర్జరీ ఉచ్చు బిగుస్తోంది. జగన్ జమానాలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా. కాకాణి అండతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది.


అక్రమ తవ్వకాలు..

సర్వేపల్లి రిజర్వాయర్‌తో సహా చెరువుల్లో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి రూ.వందల కోట్లలో స్వాహా చేశారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగుంట పేరుతోనూ అక్రమ అనుమతులు తీసుకోవడంతో అప్పట్లోనే కాకాణి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. మాగుంట సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే పదిమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పర్యవేక్షణాధికారిగా బాపట్ల ఎస్పీ, పరిశోధనాధికారిగా బాపట్ల డీఎస్పీ రెండు రోజులుగా ముమ్మర విచారణ జరుపుతున్నారు. గ్రావెల్ అక్రమాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ నేతలపై కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.


భారీ కుంభకోణం..

కాగా.. వైసీపీ హయాంలో భారీ కుంభకోణం బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫోకస్ పెట్టింది. బాధితులు కూడా పెద్దఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ‌కాకాణి అక్రమ భాగోతాలు బయటకు వస్తున్నాయి. రూ.230కోట్ల విలువ చేసే పేదల భూములను తన అల్లుడు కంపెనీకి అప్పనంగ దోచిపెట్టినట్లు కాకాణిపై ఆరోపణలు వచ్చాయి. రామదాసుకండ్రిగ ప్రాంతంలో పోర్టు రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.


అల్లుడి డొల్లకంపెనీకి భూములు..

రైతులను బెదిరించి, భయపెట్టి ఎకరా భూమి రూ.15,62,142లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక్కరోజు ముందు కాకణి అల్లుడి డొల్లకంపెనీకి భూములను గత జగన్ ప్రభుత్వం అప్పగించింది. 2024 మార్చి నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి నెల 15న భూములు అప్పగిస్తూ ప్రొవిజనల్ అలాట్మెంట్‌ను ఏపీఐఐసీ ఆర్డర్ మంజూరు చేసింది. భూముల అప్పగింతకు కాకాణి, వైసీపీ పెద్దలు, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు చక్రం తిప్పారు. భూముల కోసం జీకేఎస్ ఇండస్ట్రీయల్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట డొల్ల కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ డొల్ల కంపెనీలో రాత్రికి రాత్రే కాకాణి అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డికి సీఈఓ పదవి అప్పగించారు. కాకాణి భూ కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై విచారణ జరిపించి, న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Judicial Magistrate : పోసానికి ఆదోని కోర్టు రిమాండ్‌

AP Govt: పెట్టుబడుల పర్యవేక్షణకు‘స్టేట్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ గ్రూప్‌’

AP Govt: రెవెన్యూ చట్టాల్లో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 06 , 2025 | 08:49 AM