Home » Kakani Govardhan Reddy
వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. బాలిక మృతి కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు రావాలని ఆదేశించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు అయ్యాయి.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.
సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
మైకా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. కాకాణికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.
నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులు తారుమారు చేశారని కాకాణిపై కేసు నమోదు అయ్యింది.
Kakani Police Custody: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి మొదటి రోజు 30 ప్రశ్నలు సంధించారు పోలీసులు.
అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు.