కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:23 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది.
నెల్లూరు, ఆగస్టు 14: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు... ఇష్టారాజ్యంగా భూములు, స్థలాలను పందారం చేసినట్లు తేలింది. వెంకటచాలం మండలం కనుపూరు బిట్ - 1లో దేవాదాయశాఖ భూముల్లో జగనన్న లే అవుట్ నిర్మించారని, 185 మందికి పట్టాలు పంపిణీ చేశారని, 310 స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
అలాగే, సర్వేపల్లి బిట్ -2లో కోర్టుల్లో ఉన్న 57.16 ఎకరాల భూములని మాజీ మంత్రి కాకాణి అల్లుడికి చెందిన JKS ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సంస్థకి అధికారులు కారుచౌకగా కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆరుగురు తహశీల్దార్లు, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వోలపై అభియోగాలు నమోదు చేసిన అధికారులు.. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెవెన్యూశాఖ అధికార వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మెడికో మృతి
శ్రావణ మాసం మొదటి శుక్రవారం.. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి
Read Latest AP News And Telugu News