Undavalli Arun Kumar: జగన్పై ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - May 05 , 2025 | 12:41 PM
Undavalli Arun Kumar: ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

రాజమండ్రి:వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి అవ్వగానే కక్ష సాధింపు చర్యలు వద్దని గతంలోనే చెప్పానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) అన్నారు. జగన్ తప్పు చేస్తే జగన్ని జైలులో పెట్టాలని చెప్పారు. పోలీసులను జైల్లో పెట్టవద్దని అన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్లు తనకు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు. అందులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని.. ఆంజనేయులు జైలుకి వెళ్లినప్పుడు చూడటానికి వెళ్లానని అన్నారు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే తొలిసారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో తన కార్యాలయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఏపీ పునర్వభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. పిటీషన్లో మార్పు చేసి ఏపీ పునర్వభజన తప్పు అని నిర్థారించాలని మళ్లీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని తెలిపారు. 2014 పిబ్రవరి 18వ తేదీన పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటుచేసి సుప్రీంకోర్టులో కేసు పాలో ఆప్ చేయాలని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
ఏపీ పునర్వభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నేటికి 11 ఏళ్లు పూర్తయిందని వెల్లడించారు. పవన్ కల్యాణ్కు ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని చెప్పారు. యుద్దం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. మతం ప్రధానమనేది భారతదేశంలో సరికాదన్నారు. ఇండియాలో 12 శాతం ముస్లింలు ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్లో హిందువులు ఒక్క శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. ముస్లింలపై వ్యతిరేకత సృష్టించకూడదని.. కానీ పాకిస్తాన్ను వ్యతిరేకించాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్
Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..
Nara Lokesh: బకింగ్ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి
టెల్అవీవ్ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి
For More AP News and Telugu News