Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:53 PM
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ(మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ(మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. తుపాను ప్రభావిత జిల్లాల కంటే ముందుగానే ఏదైనా సురక్షిత ప్రాంతంలో వాహనాలు ఆపాలని సూచించారు. తుపాను నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు చేయొద్దని అధికారులు కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ సేవలు బంద్ : రాఘవ కుమార్
మరోవైపు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్సులకు బ్రేక్ పడింది. మొంథా తుపాను కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బస్సులని నిలిపివేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ ప్రకటించారు. ప్రయాణికులు ఎవరూ బస్టాండ్కి రావొద్దని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేసినట్లు తెలిపారు. హైదరాబాద్కి వెళ్లే ప్రైవేట్ బస్సులు కూడా నిలిపివేశామని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రాఘవ కుమార్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News