Home » APSRTC
కృష్ణా జిల్లా కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఎలక్ట్రిక్, ఏసీ బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
ఏపీఎస్ఆర్టీసీకి మరోసారి జాతీయ గుర్తింపు లభించింది. సాంకేతికత వినియోగంలో విశిష్టతకు గానూ ప్రతిష్ఠాత్మక పీఎస్ఈ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్ దక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సిబ్బంది సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై 'పీరియాడికల్ హెల్త్ చెక్-అప్' (పీహెచ్సీ) విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ సహా ఇతర విభాగాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.