Home » APSRTC
ఏపీకి చెందిన పీలేరు ఆర్టీసు బస్సు, కర్ణాటకకు చెందిన ఓ బస్సు శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ రోడ్డులో వెళ్తున్నాయి. అయితే, కర్ణాటక బస్సు వరుస క్రమంలో రాకపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ సహా ఇతర విభాగాల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది.
ఆదాయంలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డ్ నెలకొల్పింది. జనవరి 19న అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆ ఒక్కరోజే ఆర్టీసీకి రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చింది.
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు.
సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువరించారు.