Home » APSRTC
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.
గూగుల్ మ్యాప్స్తో త్వరలో ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానం కానుంది. ఈ మేరకు మ్యాప్స్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే.. ఆ రూట్లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ ఉన్న బస్సుల టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ అధికారులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను ఇవాళ(మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ వైపు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళ.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్ఎం గోపాల్రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు.
విశాఖపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు.
కూటమి ప్రభుత్వం మహిళలకు 15వ తేదీ శుక్రవారం నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి ఎలాంటి ఆటుపోట్లు ఎదురు కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కడప రీజియన్ పరిధిలోని బస్సులను పూర్తి సన్నద్ధం చేశామని ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీకి కండక్టర్ల కొరత ఏర్పడింది. మహిళల ఉచిత బస్సు పథకం అమలుకు తగిన సంఖ్యలో కండక్టర్లు లేరు. దీంతో ఓడీలలో ఉన్న కొంతమంది కండక్టర్లను రప్పించాలని, అవసరమైతే డ్రైవర్లను కూడా కండక్టర్లుగా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.