Minister Nara Lokesh: ప్రతి అతిథికి మంగళగిరి వస్త్రం బహుమతి.. మంత్రి లోకేష్ నూతన సంప్రదాయం
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:12 PM
చేనేతల ఆదాయం 30శాతం పెరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చామని గుర్తుచేశారు. ఇవాళ(గురువారం) మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగానే చేనేతలను సొంత నిధులతో అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చామని ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్.
చేనేతల ఆదాయం 30శాతం పెరిగేలా అన్నివిధాలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ నొక్కిచెప్పారు. చేనేతలను ఆదుకుంటూనే స్వర్ణకారులకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. ఏపీవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంటే... మంగళగిరిలో ట్రిపుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని ఉద్ఘాటించారు. ప్రతీ ప్రజాసమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతామని తెలిపారు. చేనేతల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి నారా లోకేష్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం
For More AP News and Telugu News