CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ
ABN , Publish Date - May 05 , 2025 | 10:40 AM
CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(సోమవారం) పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో వివిధ పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11:30 గంటలకు పథకాల అమలు తీరు, ఆర్టీజీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 2:30గంటలకు పర్యాటక శాఖ అధికారులతో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో అభివృద్ధి పనుల గురించి సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వివిధ పనులపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. అలాగే.. ఈరోజు (మే5)వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబును ప్రధానమంత్రి ఏపీ పర్యటన కోసం ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు కలవనున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసినందుకు మంత్రి వర్గ ఉప సంఘంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాజధానిపై మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతికి సబంధించిన పనులపై వరుసగా సీఎం చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేసేలా వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే మంత్రి నారాయణకు కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతాం: మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిని ఎకానమీ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజలు కట్టే ట్యాక్సుల డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఉండదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అమరావతి పునఃనిర్మాణ ప్రారంభ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారని మంత్రి నారాయణ అన్నారు. అందరూ క్రమశిక్షణగా ఉన్నారని చెప్పారు. అంతమంది ప్రజలతో భారీ సభను తానేప్పుడూ చూడలేదని అన్నారు. ఈ సభను చూసి కొందరు వైసీపీ నేతలు తట్టుకోలేక తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అమరావతిపై లేనిపోని ఆరోపణలు, విషప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్
Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..
Nara Lokesh: బకింగ్ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి
టెల్అవీవ్ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి
For More AP News and Telugu News