Share News

Loksabha polls 2024: సోషల్ మీడియాలో దుష్ర్పచారం.. బీజేపీపై ఈసీకి ఫిర్యాదు: హరీష్‌రావు

ABN , Publish Date - May 01 , 2024 | 10:26 AM

Telangana: మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం పట్టణంలోని నెహ్రు పార్క్ నుంచి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు జనం నీరాజనాలు పడుతున్నారన్నారు.

Loksabha polls 2024: సోషల్ మీడియాలో దుష్ర్పచారం.. బీజేపీపై ఈసీకి ఫిర్యాదు: హరీష్‌రావు
Former Minister Harish Rao

సిద్దిపేట, మే 1: మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి (Medak BRS MP Candidate Venkatramireddy) గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) తీవ్రంగా శ్రమిస్తున్నారు. బుధవారం పట్టణంలోని నెహ్రు పార్క్ నుంచి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు జనం నీరాజనాలు పడుతున్నారన్నారు.

AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత


వాస్తవాలు చెప్పుతే ప్రజలు నమ్ముతారన్నారు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో ఫేక్ వీడియోను ప్రజల్లోకి వదిలారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మచ్చ లేని వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోరిక మేరకు వెంకట్రామి రెడ్డి పోటీ చేస్తున్నారన్నారు. అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారని.. కానీ వెంకట్రామిరెడ్డి తన సంపదను పంచడానికి వస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న ఫేక్ వీడియోలపై ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని హరీష్‌రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

T20 World Cup: స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్.. మిచెల్ మార్ష్‌కు కెప్టెన్సీ.. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే..!

నేడు పెన్షన్లు పడవు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2024 | 10:28 AM