Share News

AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత

ABN , Publish Date - May 01 , 2024 | 09:39 AM

Andhrapradesh: టీడీపీ నేత జయరాం నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గత అర్ధారాత్రి టీడీపీ నేత జయరాం నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు...

AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత
Concern of TDP leaders in Anantapur

అనంతపురం, మే 1: టీడీపీ నేత జయరాం నాయుడు (TDP Leader Jayaram Naidu) అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం నేతలు (TDP Leaders) ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గత అర్ధారాత్రి టీడీపీ నేత జయరాం నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆందోళన చేపట్టారు.

YSRCP: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే టార్గెట్.


ఓటమి భయంతో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి (MLA Ananta Venkatramireddy) పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక డీఎస్పీ వీర రాఘవరెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రజల్లో వస్తున్న జనాదరణ చూసే పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి కుయుక్తులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బయట తిరగకూడదని కక్షతో అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు.

నేడు పెన్షన్లు పడవు!


కాగా.. గత అర్థరాత్రి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయనను తిప్పారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో జయరాం నాయుడు కుటుంబ సభ్యులను వన్ టౌన్ సిఐ రెడ్డప్ప బెదిరింపులకు గురిచేశాడు.


ఇవి కూడా చదవండి..

Bangalore: ‘డర్టీ’ పిక్చర్‌ గుట్టు రట్టయింది.. ప్రజ్వల్‌ డ్రైవర్‌ వల్లే!

YS Jagan Cases: జగన్‌ కేసులు మళ్లీ మొదటికి!

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 09:45 AM