Share News

MP Arvind: కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:19 AM

సీఎం రేవంత్ రెడ్డిపై.. బీజేపీ ఎంపీ ధర్మపురి ‌అర్వింద్ సంచల‌న‌ కామెంట్స్ చేశారు. నేడు బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమంటూ మరోసారి అర్వింద్ స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్‌తో అయ్యే పని కాదన్నారు. ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారన్నారు.

MP Arvind:  కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు కాంగ్రెస్ పార్టీపై.. బీజేపీ ఎంపీ ధర్మపురి ‌అర్వింద్ సంచల‌న‌ కామెంట్స్ చేశారు. నేడు బీజేవైఎం కార్యకర్తల సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమంటూ మరోసారి అర్వింద్ స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోవటం కాంగ్రెస్‌తో అయ్యే పని కాదన్నారు. ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా కేసీఆర్ మాత్రమే కంట్రోల్ చేయగలిగాడన్నారు. ప్రస్తుతం బీజేపీని అడ్డుకోవటం కాంగ్రెస్ వల్ల కావటం లేదన్నారు.

వంద బాదాడు.. వెయ్యి నొక్కాడు!


45ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఎన్నారైల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని అర్వింద్ అన్నారు. కనీసం పది వేల మంది ఎన్నారైల‌ు వాపస్ తీసుకురాకుంటే.. తన పేరు మార్చుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే.. టెర్రరిస్టుల సీరియల్ బాంబ్ బ్లాస్ట్‌లు ఉంటాయన్నారు. జగిత్యాల పీఎఫ్ఐకి, లవ్ జిహాద్‌కు అడ్డాగా మారుతుందన్నారు. గల్ఫ్ కార్మికుల కష్టాలకు కారణం కాంగ్రెసేనన్నారు. కాంగ్రెస్ గెలిస్తే.. హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తారని అన్నారు. నలబై ఏళ్లుగా జగిత్యాలకు జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తాను పసుపు బోర్డును తీసుకొచ్చానని అర్వింద్ అన్నారు.

Leopard: హైదరాబాదీలు హై అలర్ట్.. నగరంలోకి ప్రవేశించిన చిరుత

Rain Alert: రోళ్లు పగిలే ఎండలో చల్లటి కబురు.. హైదరాబాద్‌ వాసులు ఊపిరి పీల్చుకోండి

Read Latest Telangana News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 10:19 AM