Home » Dharmapuri Arvind
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. వివరాల్లోకి వెళితే..
రేవంత్రెడ్డి సీఎం అయ్యాక చేసిందేమీ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ శ్రద్ధ అంటూ వ్యాఖ్యానించారు.
దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడమనేది చారిత్రక ఘట్టమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్లో పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారమిచ్చారు. వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు.
సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు.
ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్లు బయటపడే అవకాశం ఉందన్నారు.
ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు మంత్రి ఉత్తమ్ ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ కొత్త నాటకమాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.