Share News

Pranav Gopal: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే..

ABN , Publish Date - Mar 05 , 2024 | 12:05 PM

Andhrapradesh: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ధైర్యవంతుడైతే ముందస్తు అరెస్ట్‌లు దేనికి? పరదాలు మాటున నక్కి నక్కి రావడం ఎందుకు? అని ప్రశ్నించారు.

Pranav Gopal: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే..

విశాఖపట్నం, మార్చి 5: దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే (CM Jagan Reddy) అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ (TNSF Chief Pranav Gopal) వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖలో (Visakhapatnam) సీఎం జగన్ పర్యటన సందర్భంగా ప్రణవ్ గోపాల్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ధైర్యవంతుడైతే ముందస్తు అరెస్ట్‌లు దేనికి? పరదాలు మాటున నక్కి నక్కి రావడం ఎందుకు? అని ప్రశ్నించారు. వైజాగ్‌లో జగన్ సభతో గత వారం రోజులుగా చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

AP Politics: నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి శబరి..? ఏ పార్టీ నుంచి అంటే..?


5 ఏళ్ల తరువాత మళ్లీ యువతను మోసగించేందుకు జగన్ రెడ్డి (YSRCP Chief Jagan) సిద్ధమయ్యారన్నారు. ధర్మ యుద్ధం చేయడం చేతగాని దద్దమ్మ సిద్ధం అనడం హేయమన్నారు. నిన్ను నమ్మేందుకు యువత సిద్ధంగా లేరు జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఓటు - రాష్ట్రానికి వేటు - యువతకు చేటు అని అన్నారు. ఎన్నికల ముందు మాత్రమే జగన్ రెడ్డికి మా యువత గుర్తుకువస్తారా? అంటూ నిలదీశారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేకహోదా అడగకుండా యువత భవితను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని ప్రణవ్ గోపాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

TS News: పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నిందితుడికి బర్త్ డే వేడుకలా.. ఏంటిది ఎస్సైగారూ..!



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 12:05 PM