Share News

AP Election 2024: జగన్‌కు భయపడి విదేశాలకు విజయలక్ష్మి.. చింతమనేని సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 06:12 PM

సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.

 AP Election 2024: జగన్‌కు భయపడి విదేశాలకు విజయలక్ష్మి.. చింతమనేని సంచలన ఆరోపణలు

అమరావతి: సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పై జరిగిన రాయి దాడి వెనుక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డిపై రాయి దాడి పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు. రాయి దాడి వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సజ్జలదేనని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సజ్జల ఫ్రీ ప్లాన్‌తో జగన్‌పై సింపతి కోసమే రాయి దాడి చేయించుకున్నారని విమర్శించారు.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

జగన్‌పై రాయి దాడి జరిగినప్పుడు ఆయన ఛానల్ సాక్షి లైవ్ ఎందుకు కట్ అయ్యిందని ప్రశ్నించారు. రాళ్ల దాడి జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ , నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? అని నిలదీశారు. దండ వేస్తుంటే జగన్‌కు బైండింగ్ వైర్ గీసుకోవడంతోనే గాయం అయిందని ఆరోపించారు.


Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

జగ‌న్‌కు కోపం వచ్చి మోచేతితో గుద్దడంతో వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్ గుడ్డు పగిలిందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం అప్పుడు గొడ్డలి వేటు, కోడికత్తి డ్రామా, నేడు రాయి దాడి డ్రామా మొదలెట్టారని సెటైర్లు గుప్పించారు. జగన్‌తో అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాణి ఉందని హెచ్చరించారు. జగన్‌కు భయపడి ఆయన తల్లి విజయలక్ష్మి విదేశాలకు పారిపోయారని చింతమనేని ప్రభాకర్ ఎద్దేవా చేశారు.


AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 06:15 PM