Home » Sajjala Ramakrishna Reddy
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతల అరెస్టులో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టారని రాద్ధాంతం చేస్తున్నారని సజ్జలపై మండిపడ్డారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక రాయి అయినా వేశారా అని టీడీపీ నేత హనుమతరావు ప్రశ్నించారు. చంద్రబాబు సారథ్యంలో ఇప్పుడు అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 2న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారని.. అక్కడ వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలని మంత్రి అన్నారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ..
మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ మోసం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితుడు అడపా ప్రేమ్చంద్పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ను బాధితుడు మన్నే సుబ్బారావు అభ్యర్థించారు.