Share News

AP Politics: మచిలీపట్నంలో ఫ్లెక్సీల రాజకీయం.. ఇదేం అరాచకమంటున్న టీడీపీ

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:52 AM

Andhrapradesh: జిల్లాలోని మచిలీపట్నంలో ప్లెక్సీల రాజకీయం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికార పార్టీ వైసీపీ టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పేర్ని నాని మౌఖిక ఆదేశాలతో టీడీపీ ప్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.

AP Politics: మచిలీపట్నంలో ఫ్లెక్సీల రాజకీయం.. ఇదేం అరాచకమంటున్న టీడీపీ

కృష్ణాజిల్లా, మార్చి 12: జిల్లాలోని మచిలీపట్నంలో ప్లెక్సీల రాజకీయం తారాస్థాయికి చేరింది. టీడీపీ (TDP) ఏర్పాటు చేసిన ప్లెక్సీలను అధికార పార్టీ వైసీపీ (YSRCP) టార్గెట్ చేసింది. ఎమ్మెల్యే పేర్ని నాని (MLA Perni Nani) మౌఖిక ఆదేశాలతో టీడీపీ ప్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలకు పాల్పడ్డారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం వైసీపీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే ఉంచి టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్లెక్సీల తొలగింపుపై టీడీపీ నాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వైసీపీ ఫ్లెక్సీలను ఉంచేసి టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి...

నమ్మి.. నిండా మునిగాం!

AP News: వివాహిత దుర్మరణంపై రాజకీయ దుమారం! అసలేం జరిగిందంటే?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 09:52 AM