Share News

CPI: అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుంది: నారాయణ

ABN , Publish Date - May 07 , 2024 | 12:56 PM

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు.

CPI: అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుంది: నారాయణ

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం (Election Campaign)లో భాగంగా విజయవాడ (Vijayawada), పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి (CPI Candidate) కోటీశ్వరరావు (Kotiswararao)కు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి (CPI National Secretary) నారాయణ (Narayana) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ (BJP) ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు. రాను రాను భారత దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. అన్ని రాష్ట్రాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు.. అవసరమైతే పార్టీల మధ్య చీలికలు తెస్తున్నారని విమర్శించారు.


ఎమ్మెల్యే, ఎంపీలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసేందుకు కూడా ప్రస్తుతం బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఏపీలో వైసీపీ (YCP), మహా కూటమి (Maha Kutami) ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసిన ఆ ఓటు బీజీపీకు వెళుతుందని, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), వైయస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఇద్దరూ బీజేపీ కబందహస్తాల్లో చిక్కుకుపోయారన్నారు. భారతదేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చే ఏకైక పార్టీ ఇండియా కూటమి (India Kutami) అని నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అనకాపల్లిలో పోటెత్తిన ప్రజాగళం..

రాజమండ్రిలో ప్రధాని మోదీ బహిరంగ సభ.. (ఫోటో గ్యాలరీ)

ఓటమి భయంతో వైసీపీ దాడులు: కన్నా..

మోదీ మాటలతో జగన్‌లో టెన్షన్.. టెన్షన్..

జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు..

పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 07 , 2024 | 12:58 PM