ఓటమి భయంతో వైసీపీ దాడులు: కన్నా..

ABN, Publish Date - May 07 , 2024 | 08:44 AM

పల్నాడు జిల్లా: ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంకుల గుంట నుంచి నరసరావుపేటలో డాక్టర్‌ను కలవాలని వెళుతున్న తమ కార్యకర్తలను అడ్డుకుని దాడి చేసి కారు ద్వంసం చేశారని మండిపడ్డారు.

పల్నాడు జిల్లా: ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంకుల గుంట నుంచి నరసరావుపేటలో డాక్టర్‌ను కలవాలని వెళుతున్న తమ కార్యకర్తలను అడ్డుకుని దాడి చేసి కారు ద్వంసం చేశారని మండిపడ్డారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే.. పోలీసుల కళ్ల ఎదుటే దాడి చేశారని చెప్పారు. దీంతో జిల్లాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నయో అర్దం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీ మాటలతో జగన్‌లో టెన్షన్.. టెన్షన్..

జగన్ ప్రభుత్వానికి అదే ఉరితాడు..

జగన్‌ బేల మాటలు!

పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

మోదీ కనుసన్నల్లో రేవంత్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 07 , 2024 | 08:44 AM