Share News

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

ABN , Publish Date - Mar 13 , 2024 | 09:31 AM

Andhrapradesh: జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ కూటమి భారీ బహిరంగ సభకు పూనుకుంది. ఇందుకోసం బొప్పూడి వద్ద స్థలాన్ని టీడీపీ - జనసేన నేతలు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం బొప్పూడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు.

TDP: బొప్పూడికి చేరుకున్న నారా లోకేష్

పల్నాడు, మార్చి 13: జిల్లాలోని చిలకలూరిపేటలో ఈనెల 17న టీడీపీ కూటమి భారీ బహిరంగ సభకు పూనుకుంది. ఇందుకోసం బొప్పూడి వద్ద స్థలాన్ని టీడీపీ - జనసేన నేతలు (TDP -Janasena) ఎంపిక చేశారు. ఇందులో భాగంగా స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) బుధవారం ఉదయం బొప్పూడి చేరుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu), మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pulla rao), టీడీపీ, జనసేన, బీజేపీ (BJP) ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి లోకేష్ చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద భూమి పూజా కార్యక్రమంలో నారా లోకేష్, మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోదీ (PM Modi) పాల్గొనే సభ ఏర్పాట్లను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Chandrababu: టీడీపీ శ్రేణులపై దాడిని ఖండించిన చంద్రబాబు

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 09:46 AM