Share News

AP Politics: సీఎం జగన్‌కు మైండ్‌బ్లాంక్ షాక్.. కీలక మంత్రి ఔట్..!

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:44 PM

TDP Jayaho BC Sabha: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీలో రాజకీయం రక్తికట్టిస్తోంది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వసల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ(TDP), జనసేన(Janasena) సంయుక్తంగా నిర్వహిస్తున్న బీసీ జయహో సదస్సు ప్రాంగణానికి వచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం. సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు(Chandrababu) పుష్పగుచ్చం అందజేసి..

AP Politics: సీఎం జగన్‌కు మైండ్‌బ్లాంక్ షాక్.. కీలక మంత్రి ఔట్..!
Gummanur Jayaram Joined TDP

TDP Jayaho BC Sabha: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీలో రాజకీయం రక్తికట్టిస్తోంది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వసల పరంపర కొనసాగుతోంది. తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ(TDP), జనసేన(Janasena) సంయుక్తంగా నిర్వహిస్తున్న బీసీ జయహో సదస్సు ప్రాంగణానికి వచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం. సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు(Chandrababu) పుష్పగుచ్చం అందజేసి.. శాలువాతో సత్కరించారు. గత కొద్ది రోజులు ఆయన వైసీపీని వీడుతారనే ప్రచారం బలంగా వినిపించింది. చివరకు అది నిజమైంది. మంత్రి జయరాం టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమక్షంలో గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే జయరాం తమ్ముడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనతో పాటు.. జయరాం కూడా టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

జగన్‌ వెన్నులో వణుకు పుట్టేలా జయహో బీసీ సభ..

అమరావతిలో జనసేన, టీడీపీ సంయుక్తంగా జయహో బీసీ సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ బాస్ చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరవుతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నారా లోకేష్, పవన్ కల్యాణ్ కూడా సభ వద్దకు వచ్చేశారు. కాగా, వేదికపై ముఖ్య అతిథులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా 325 కుర్చీలు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2024 | 05:48 PM